అక్షరటుడే, వెబ్డెస్క్ : Jurala Project Flood | ఎగువన కర్ణాకటలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది శ్రీశైలం (Srisailam) వైపు బిరబిర పరుగులు పెడుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు (Narayanpur Dam) నిండుకుండలా మారడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Jurala Project Flood | విద్యుదుత్పత్తి ప్రారంభం
ఎగువ నుంచి వస్తున్న వరదతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. జలాశయానికి ప్రస్తుతం 27 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 16,750 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదు అవుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318 మీటర్ల మట్టానికి నీరు చేరింది. దీంతో అధికారులు రెండు యూనిట్లలో 78 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆ నీరు శ్రీశైలం వైపు పరుగులు పెడుతోంది.
ఈ సీజన్తో తెలంగాణలో తొలిసారి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అయింది. ఇన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో జలాశయాలు డెడ్స్టోరేజీకి చేరాయి. దీంతో జల విద్యుత్ ఉత్పత్తి చేపట్టే పరిస్థితులు లేక ప్రభుత్వం థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచింది. తాజాగా కృష్ణానది (Krishna River)కి వరద కొనసాగుతుండటంతో జూరాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగనుంది.
దీనిని కూడా చదవండి : RS Praveen Kumar | హైకోర్టు తీర్పు రేవంత్రెడ్డికి చెంపపెట్టు : ఆర్ఎస్ ప్రవీణ్కుమార్