అక్షరటుడే, వెబ్డెస్క్ : Rythu Bharosa | రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రెండో విడత రైతు భరోసా నిధులను ఈ నెల 20న విడుదల చేస్తామని తెలిపింది.
రాష్ట్రంలో ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతు భరోసా కింద ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. గతంలో సీజన్ ప్రారంభానికి ముందు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసేవారు. అయితే యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా ఆలస్యం అయింది. తొలి విడత నిధులను మార్చి 22న ప్రభుత్వం విడుదల చేసింది. తొలి విడతలో ఎకరంలోపు ఉన్న రైతులకు డబ్బులు పడ్డాయి. అలాగే ఎకరం కంటే భూమి ఎక్కువగా ఉన్న వారికి ఎకరం డబ్బులు పడ్డాయి. మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు రూ.3,590 కోట్లు జమ అయ్యాయి.
Rythu Bharosa | రూ.5,653 కోట్లు
రైతు భరోసా రెండో విడత నిధులను 20 రోజుల్లో విడుదల చేస్తామని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) గతంలో ప్రకటించారు. ఈ క్రమంలో ఈ నెల 20న భూపాలపల్లి జిల్లా కాటారం బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి రైతు భరోసా విడుదల చేయనున్నారు. మొత్తం 45,11,947 మంది రైతులకు రూ.5,653 కోట్ల నిధులు జమ చేయనున్నారు. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : Singer Mangli | సింగర్ మంగ్లీని బహిష్కరించాలని ఫిర్యాదు

