Ayodhya Bomb Note | మెడికల్ కాలేజీలో బాంబు తయారీ నోట్‌ లభ్యం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రాజర్షి దశరథ్ ప్రభుత్వ స్వయంప్రతిపత్తి మెడికల్ కాలేజీలో బాంబు తయారీ విధానానికి సంబంధించిన నోట్‌ లభించడం తీవ్ర కలకలం రేపింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ayodhya Bomb Note | ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రాజర్షి దశరథ్ ప్రభుత్వ స్వయంప్రతిపత్తి మెడికల్ కాలేజీలో బాంబు తయారీ విధానానికి సంబంధించిన నోట్‌ లభించడం తీవ్ర కలకలం రేపింది. కాలేజీలోని ఎక్స్-రే విభాగంలో నైట్ షిఫ్ట్ ముగిసిన తర్వాత ల్యాబ్‌లో ఈ పత్రాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ల్యాబ్ టెక్నీషియన్ మొదటి సంవత్సరం చదువుతున్న సర్‌ఫరాజ్ అనే విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.

Ayodhya Bomb Note | సినిమా చూస్తూ రాసుకున్నానన్న విద్యార్థి..

బలరాంపూర్ జిల్లాకు చెందిన ఈ విద్యార్థి నైట్ డ్యూటీ సమయంలో ల్యాప్‌టాప్‌లో సినిమా చూస్తూ, అందులోని బాంబు తయారీ విధానాన్ని కాగితంపై రాసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడించాడు. అయితే అతడి ప్రకటనను పోలీసులు పూర్తిగా సరిచూస్తున్నారు. అయోధ్య అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో, ఎస్‌ఓజీ (SOG), ఎస్‌టీఎఫ్‌ (STF), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) వంటి ప్రతిష్టాత్మక భద్రతా సంస్థల అధికారులు పోలీస్ లైన్స్‌లో అతడిని సమగ్రంగా విచారిస్తున్నారు. పూర్తి విచారణ ముగిసిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి:  Hardik Pandya | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్​ పాండ్యా

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *