అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Pocharam Srinivas Reddy | నగరంలో బాన్సువాడ కాంగ్రెస్ నాయకులు హల్చల్ చేశారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై భైఠాయించారు.
Pocharam Srinivas Reddy | దుబ్బలోని ఎంకే గార్డెన్ వద్ద..
నిజామాబాద్ (Nizamabad) నగరంలోని దుబ్బప్రాంతంలోని ఎంకే గార్డెన్లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్కుమార్ గౌడ్, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి, మంత్రి సీతక్క హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి వర్గం కాంగ్రెస్ నాయకులు గార్డెన్ ఎదుట బైఠాయించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి తమకు అవసరం లేదని నినదించారు. వెంటనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. బాన్సువాడలో పోచారం తీరుతో కాంగ్రెస్ పార్టీతో తీవ్ర నష్టం ఏర్పడుతోందన్నారు. ఆయన నిర్ణయాల కారణంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతోందన్నారు. వెంటనే ఆయనను పార్టీ నుంచి తొలగించాలని పేర్కొంటూ ధర్నాకు దిగారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Forest Conservation | అటవీ సంరక్షణకు సమన్వయంతో పనిచేయాలి: కలక్టర్ భవేష్ మిశ్రా