అక్షరటుడే, వెబ్డెస్క్: India vs Sri Lanka Test | శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 206 పరుగులకే ఆలౌటైంది. దీంతో 165 పరుగుల తేడాతో భారత్ గెలిచింది.
తొలి ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంకను 284 పరుగులకు కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 193 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో శ్రీలంక 372 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగింది. ధనుంజయ డిసెల్వ (59), సోనాల్ దినుష (84) రాణించడంతో 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 142 పరుగుల వరకు తర్వాత వికెట్ కోల్పోలేదు. వికెట్ కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. డి సెల్వను రవీంద్ర జడేజా ఔట్ చేయడంతో మిగతా వికెట్లు సైతం టపటప పడిపోయాయి. దీంతో భారత్ (India) విజయం సాధించగా.. రెండు టెస్టుల సిరిస్లో 1–0లీడ్లోకి వెళ్లింది.
India vs Sri Lanka Test | రాణించిన మానవ్ సుతార్
భారత బౌలర్ మానవ్ సుతార్ రాణించాడు. తొలి ఇన్నింగ్స్లో 4, రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీశాడు. మొత్తం 10 వికెట్లు తీయడంతో పాటు తొలి ఇన్నింగ్స్లో 24 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో ప్రసిద్ కృష్ణ 2, జడేజా, సిరాజ్ తలో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో పడిక్కల్ 167, రాహుల్ 82, ద్రువ్ జురేల్ 51 పరుగులతో రాణించగా.. సెకండ్ ఇన్నింగ్స్లో పంత్ 66, పడిక్కల్ 44 పరుగులు చేశారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ రెండు ఇన్నింగ్స్ల్లో విఫలం అయ్యాడు.
ఇది కూడా చదవండి..: Kavya Maran Wedding | కావ్యా మారన్–అనిరుధ్ పెళ్లి? నవంబర్ 10న గ్రీస్లో అంటూ ప్రచారం