అక్షరటుడే, వెబ్డెస్క్: NEET PG Student Suicide | హైదరాబాద్ మహా నగరంలో నీట్ పీజీకి సిద్ధమవుతున్న ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని అపరాజిత హాస్టల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
కర్నూలుకు చెందిన యశ్విత గత ఆరు నెలలుగా హైదరాబాద్లో ఉంటూ నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పరీక్షకు ఒక్కరోజు ముందు తీవ్ర ఒత్తిడికి లోనైన ఆమె విషపదార్థం తీసుకున్నట్లు తెలుస్తోంది. విషయం గుర్తించిన వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు.
NEET PG Student Suicide | పోలీసుల దర్యాప్తు
యశ్విత కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్రెడ్డి ఏకైక కుమార్తెగా సమాచారం. ఉన్నత విద్యను అభ్యసిస్తూ వైద్య రంగంలో ముందుకు సాగాల్సిన యువతి ఇలా మృత్యువాత పడటం కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, పరీక్ష ఒత్తిడి ఎంతవరకు కారణమన్న అంశంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.