Popular Channel reunion | 25ఏళ్ల తర్వాత పాపులర్​ ఛానల్​ నెట్​వర్క్​ బృందం ఆత్మీయ సమ్మేళనం..

నగరంలోని పాపులర్ ఛానల్​లో పనిచేసిన  యజమాన్యం.. నెట్​వర్క్ బృందం సభ్యులు 25ఏళ్ల  తర్వాత ఒక్కచోట కలిశారు. 

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Popular Channel reunion | నగరంలోని (Nizamabad ) పాపులర్ ఛానల్​లో పనిచేసిన  యజమాన్యం.. నెట్​వర్క్ బృందం సభ్యులు 25ఏళ్ల  తర్వాత ఒక్కచోట కలిశారు.  జిల్లా కేంద్రం ఈ ఆత్మీయ సమ్మేళనానికి (media reunion) వేదికైంది.

Popular Channel reunion | 30ఏళ్ల క్రితం పాపులర్​ ఛానల్​..

పాపులర్ ఛానల్ గత 30 ఏళ్ల క్రితం కేంద్రంలో ఏర్పాటైంది. అప్పట్లో ఛానల్​ పేరులాగే చాలా పాపులర్​ అయ్యింది. ఈ  సందర్భంగా 25ఏళ్ల తర్వాత ఛానల్​ యాజమాన్యం, సిబ్బంది ఒక్కచోట కలిసి ఆనందంగా గడిపారు.  యజమాన్యంతో పాటు ఇక్కడ పని చేసిన సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పిల్లలతో సహా ఇక్కడికి వచ్చి వారి అనుభూతిని పంచుకున్నారు. ఇప్పటివరకు ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ బ్యాచ్​ విద్యార్థులు మాత్రమే ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకున్నారని.. అయితే వినూత్నంగా ఓ ఛానల్​ బృందం ఒక్క చోట కలిసి సందడి చేయడం ఆనందంగా ఉందని బృందం సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాపులర్ ఛానల్​ ఎండీ మీసాలా సుధాకర్ మాట్లాడుతూ సిబ్బంది ఇన్నేళ్ల తర్వాత ఒక్కచోట కలవడం ఆనందంగా ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో పాపులర్ టెక్నీషియన్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Sajjala Comments | అటెన్షన్ కోసమే విజయ సాయిరెడ్డి ఆరోపణలు : సజ్జల

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *