అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంతో దుకాణాలు కోల్పోయిన బాధితులకు అండగా నిలుస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాచౌక్ వద్ద అగ్నిప్రమాదం సంభవించి షాపులు దగ్ధమై జీవనోపాధి కోల్పోయిన బాధితులను మంగళవారం పరామర్శించారు.
Shabbir Ali | ఆర్థిక సహాయం అందజేత
అగ్ని ప్రమాద వివరాలను షబ్బీర్ అలీ అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం వల్ల 18 షాపులు దగ్ధం కావడం బాధాకరమన్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు. రూ.35 లక్షల వరకు నష్టం జరిగిందని అధికారులు అంచనా వేయడం జరిగిందని వివరించారు. బాధితులను ఏ విధంగా ఆదుకోవాలి అనే విషయమై చర్చిస్తామని తెలిపారు. అనంతరం 21 షాపుల బాధితులకు దాదాపు రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో గిరి, మున్సిపల్ ఛైర్పర్సన్ ఉమారాణి, కమిషనర్ పర్వతాలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Self Enumeration Record | స్వీయ గణనలో రికార్డు.. సోమ్లా నాయక్ తండా ఘనత

