అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Kidnapping Case | జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించిన బాలుడి కిడ్నాప్ కేసును 24 గంటల్లోనే ఛేదించామని సీపీ సాయిచైతన్య (CP Saichaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలో (Nizamabad) కిడ్నాప్ వివరాలను విలేకరులకు వివరించారు.
Nizamabad Kidnapping Case | చాక్లెట్ ఆశ చూపి..
సీపీ మాట్లాడుతూ.. శనివారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన బాధిత కుటుంబం వద్ద నుంచి బాలుడు వేదాన్ష్ను చాక్లెట్ ఆశ చూపి అపహరించారని పేర్కొన్నారు. కిడ్నాపర్లను నిజాంపేట్ గ్రామస్తులు సుజాత, ఎల్లమ్మగా గుర్తించామన్నారు. ఆస్పత్రి నుంచి బాలుడిని కేవలం మూడు నిమిషాల్లోనే ఎత్తుకెళ్లారని సీపీ తెలిపారు. సీసీ పుటేజీల ఆధారంగా బాలుడిని సంగారెడ్డి జిల్లాలోని దౌలతాబాద్ ప్రాంతానికి తీసుకెళ్లినట్లుగా గుర్తించి వారిని అరెస్ట్ చేశామన్నారు. అనంతరం బాలుడిని రక్షించి ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తులు ఏ వస్తువులు ఇచ్చినా తీసుకోవద్దని పిల్లలకు అవగాహన కల్పించాలని సీపీ పేర్కొన్నారు. పిల్లలను బయటకు తీసుకెళ్లినప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇది కూడా చదవండి: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఈసారి ఆటే సవాల్!