అక్షరటుడే, వెబ్డెస్క్ : Thatha Madhu | కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy)ని కలిశారు. స్పీకర్పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ నాయకులు నల్ల టీ షర్టులు ధరించి రాగా.. పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు పోలీసులతో వాగ్వాదం చేశారు. వారు తన ప్యాంట్ లాగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు. తాతా మధును తక్షణమే ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని కోరారు. బీఆర్ఎస్ నేతలు స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు దళితులంటే చిన్న చూపు అన్నారు.
Thatha Madhu | స్పీకర్ను అవమానపర్చలేదు
ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ తాతా మధు స్పందించారు. తమ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారన్నారు. తాను దురుసుగా మాట్లాడటం నిజమేనని అంగీకరించారు. అయితే స్పీకర్ను, ఛైర్ను అవమానపర్చలేదన్నారు.
ఇది కూడా చదవండి..: Uttam Kumar Reddy Comments | కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారు: మంత్రి ఉత్తమ్ కుమార్