అక్షరటుడే, కామారెడ్డి: Jagadam Naresh CI | శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సీఐ జగడం నరేష్ అన్నారు. భిక్కనూరు (Bhiknoor) పోలీస్స్టేషన్లో సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన సీఐ సంపత్ కుమార్ను ఐజీ కార్యాలయానికి (IG Office) అటాచ్ చేసిన విషయం తెలిసారు. ప్రస్తుతం ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు.
Jagadam Naresh CI | పలువురి శుభాకాంక్షలు
బాధ్యతలు చేపట్టిన సీఐ నరేష్ను (CI Naresh) పలువురు ఎస్సైలు, పోలీసు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతల విషయంలో ప్రజలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కామారెడ్డి (Kamareddy Police) జిల్లాలో జగడం నరేష్కు పనిచేసిన అనుభవం ఉంది. సదాశివనగర్ (Sadasivanagar) ఎస్సైగా, బిచ్కుంద(Bichkunda) సీఐగా విధులు నిర్వర్తించారు.
ఇది కూడా చదవండి: Puducherry Election Results| తట్టంచావడిలో రంగస్వామి గెలుపు.. పుదుచ్చేరిలో కాంగ్రెస్ కోటలు బద్ధలు!

