Jagadam Naresh CI | శాంతి భద్రతల పరిరక్షణకు కృషి: సీఐ జగడం నరేష్​

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Jagadam Naresh CI | శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సీఐ జగడం నరేష్​ అన్నారు. భిక్కనూరు (Bhiknoor) పోలీస్​స్టేషన్​లో సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన సీఐ సంపత్ కుమార్​ను ఐజీ కార్యాలయానికి (IG Office) అటాచ్ చేసిన విషయం తెలిసారు. ప్రస్తుతం ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు.

Jagadam Naresh CI | పలువురి శుభాకాంక్షలు

బాధ్యతలు చేపట్టిన సీఐ నరేష్​ను (CI Naresh) పలువురు ఎస్సైలు, పోలీసు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతల విషయంలో ప్రజలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కామారెడ్డి (Kamareddy Police) జిల్లాలో జగడం నరేష్​కు పనిచేసిన అనుభవం ఉంది. సదాశివనగర్ (Sadasivanagar) ఎస్సైగా, బిచ్కుంద(Bichkunda) సీఐగా విధులు నిర్వర్తించారు.

ఇది కూడా చదవండి: Puducherry Election Results| తట్టంచావడిలో రంగస్వామి గెలుపు.. పుదుచ్చేరిలో కాంగ్రెస్ కోటలు బద్ధలు!

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *