అక్షరటుడే, వెబ్డెస్క్: Kerala Political Update | దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ (Communist Party)ల పని దాదాపు ఖతం అయింది. ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళంను కూడా కోల్పోయింది. అధికార ఎల్డీఎఫ్కు కేరళం ప్రజలు షాక్ ఇచ్చారు.
దేశంలో ఒకప్పుడు చాలా ప్రభావం చూపిన కమ్యూనిస్ట్లు ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో తోక పార్టీలుగా మారిపోయారు. గతంలో పశ్చిమ బెంగాల్ (West Bengal)లో సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ తాజా ఎన్నికల్లో ఒక్క చోట కూడా ఆధిక్యంలో లేరు. కమ్యూనిస్ట్ల కంచుకోటను మమత బెనర్జీ (Mamata Banerjee) బద్దలు కొట్టగా.. వారి స్థానంలోకి బీజేపీ వచ్చింది. సుదీర్ఘ పోరాటల తర్వాత ఎట్టకేలకు బెంగాల్ కమలం పార్టీ విజయం సాధించింది.
Kerala Political Update | త్రిపురలో..
త్రిపురలో సైతం 25 అధికారంలో ఉన్నా.. ఆ పార్టీ ఇప్పుడు నామా రూపాలు లేకుండా పోయింది. 1993 నుంచి 2018 వరకు అక్కడ మాణిక్ సర్కార్ సీఎంగా ఉన్నారు. 2018లో త్రిపురను బీజేపీ (BJP) గెలుచుకుంది. అనంతరం 2023 ఎన్నికల్లో సైతం విజయం సాధించింది. దీంతో కేరళంలో మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీ కొంత మేర ప్రభావం చూపుతోంది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న ఆ పార్టీకి తాజాగా ఓటర్లు షాక్ ఇచ్చారు. కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు పట్టం కట్టారు. దీంతో దేశంలో ప్రస్తుతం ఏ రాష్ట్రంలో కూడా కమ్యూనిస్ట్లు అధికారంలో లేరు. సీపీఐ, సీపీఎంలకు కలిసి ప్రస్తుతం 11 మంది ఎంపీలు ఉన్నారు.
Kerala Political Update | శబరిమల అంశంతో..
కేరళంలో పినరయి విజయన్ (Pinarayi Vijayan) ప్రభుత్వం హిందూ వ్యతిరేకంగా వ్యవహరించింది. ముఖ్యంగా శబరిమల ఆలయ విషయంలో ఆ పార్టీ తీరుపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహం ఇప్పుడు ఓటు రూపంలో చూపించారు. దీంతో ఎల్డీఎఫ్ 40 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. సీఎం పినరయి విజయన్ సైతం వెనుకంజలో ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Vijay TVK Leads | టీవీకే అధినేత విజయ్ ఇంట్లో సంబరాలు

