అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad Collectorate | నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో (Collectorate Nizamabad) ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారని.. ఇప్పటికే ముగ్గురు కలెక్టర్లకు విన్నవించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్త చేసింది. దీంతో మనస్థాపానికి గురైన సదరు మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Nizamabad Collectorate | పోలీసులకు ఫిర్యాదు చేసినా..
ఈ సందర్భంగా ఆలూరు(Alur) మండలం టేకంపల్లికి చెందిన మహిళ చిన్మల నల్లా మాట్లాడుతూ.. ఎస్సీ కులానికి చెందిన మాతో కొన్నేళ్ల క్రితం మా ఇంటి పక్కనే ఉన్నవారు అనవసరంగా గొడవ పెట్టుకున్నారన్నారు. ఈ గొడవలో మాదే తప్పుగా భావించిన కులం సభ్యులు మమ్మల్ని కులం నుంచి బహిష్కరించారని పేర్కొన్నారు. అప్పటినుంచి తమను కుల సమావేశాలకు రానివ్వట్లేదని.. ఏ కార్యానికి పిలవట్లేదని వాపోయింది. ఈ విషయమై మాక్లూర్ (Makloor) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చామని తెలిపింది. అయితే ఫిర్యాదు ఇచ్చినా మాపైనే తిరిగి కేసు పెట్టిన పోలీసులు కోర్టుకు పంపారని ఆవేదన వ్యక్తం చేసింది.. ఎన్నోసార్లు కలెక్టర్ (Collector) ఆఫీసుకు వచ్చామని.. ఇప్పటికే ముగ్గురు కలెక్టర్లకు ఫిర్యాదు చేశామని అయినా ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. ఈ క్రమంలో ఆమె సోమవారం కలెక్టరేట్కు వచ్చిన ఆమె పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఇది కూడా చదవండి: TVK Election Results | తమిళనాడులో టీవీకే తుఫాన్.. విజయ్ పార్టీ సునామిని ముందుగానే ఊహించిన ఏకైక ఎగ్జిట్ పోల్

