అక్షరటుడే, వెబ్డెస్క్ : Bengal BJP Rise | పశ్చిమ బెంగాల్లో కమలం వికసించింది. అసెంబ్లీ ఎన్నిక (Assembly Election)ల్లో మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార పీఠం దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది.
బెంగాల్లో అడుగు పెట్టాలని బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. 2021లోనే అధికారం దక్కించుకోవాలని తీవ్రంగా శ్రమించింది. అయితే ఆ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు మమతకు పట్టం కట్టారు. కీలకమైన బెంగాల్లో విజయం కోసం బీజేపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారు. 2016 ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడు సీట్లలో మాత్రమే విజయం సాధించింది. అనంతరం ఆ పార్టీ టీఎంసీ నాయకుడు సువేంద్ అధికారిని తన పార్టీలో చేర్చుకుంది. గత ఎన్నికల్లో 77 సీట్లలో బీజేపీ గెలుపొందింది. దీంతో ప్రధాన ప్రతిపక్షంగా మారింది. నాటి నుంచి 2026 ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ నాయకులు శ్రమించారు. ఈ మేరకు తాజాగా కాషాయ జెండాను బెంగాల్ గడ్డపై ఎగురవేశారు.
Bengal BJP Rise | 193 స్థానాల్లో లీడ్
బెంగాల్లో 293 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ 193 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. టీఎంసీ 96 చోట్ల లీడ్లో ఉంది. మమత బెనర్జీ (Mamata Banerjee) ఓడిపోవాలని చాలా మంది కోరుకున్నారు. ఈ ఓటమితో టీఎంసీ పని ఖతం అయినట్లేనని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) 1975లో బెంగాల్లో ఓడిపోయింది. ఆ తర్వాత మళ్లీ అధికారంలోకి రాలేదు. అప్పటి నుంచి 2011 వరకు కమ్యూనిస్ట్లు బెంగాల్ను ఏలారు. కమ్యూనిస్ట్ల పాలనను మమత బెనర్జీ అంతం చేశారు. 15 ఏళ్లు ఆమె ముఖ్యమంత్రిగా పని చేశారు. 2011 తర్వాత బెంగాల్లో కమ్యూనిస్ట్ల ప్రభావం కోల్పోయారు. తాజాగా మమత బెనర్జీ ఓడిపోవడంతో ఆ పార్టీ పని అయిపోయినట్లేనని బీజేపీ నాయకులు (BJP Leaders)పేర్కొంటున్నారు. మమత బెనర్జీ ప్రస్తుతం 71 ఏళ్లు. ఆమెకు వారసులు లేరు. రానున్న రోజుల్లో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Bengal BJP Rise | పక్కా ప్రణాళికతో..
బెంగాల్లో గెలుపు కోసం బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లింది. బీహార్లో విజయం అనంతరం మోదీ (Modi) మాట్లాడుతు.. తర్వాత బెంగాల్ అని ప్రకటించారు. మమత బెనర్జీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. ముఖ్యంగా ఆమె ఓ వర్గం ఓటర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. బీజేపీపై కోపంతో యాంటీ హిందు స్టాండ్ తీసుకున్నారు. దీనిని బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లగలిగింది. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ బీజేపీలో గెలుపు కోసం పని చేశారు. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నాయకులు సైతం తీవ్రంగా శ్రమించారు. మమత బెనర్జీ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులకు ఆమె మద్దతు తెలిపారు. ఇప్పటికే ఉద్యోగాలు, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న స్థానిక యువతకు ఇది ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో వారు బీజేపీకి ఓటు వేశారు.
ఇది కూడా చదవండి..: TVK Election Results | తమిళనాడులో టీవీకే తుఫాన్.. విజయ్ పార్టీ సునామిని ముందుగానే ఊహించిన ఏకైక ఎగ్జిట్ పోల్


[…] […]