అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Train Accident Nizamabad | రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి (train accident) చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ రైల్వే ఎస్సై (Nizamabad Railway Station) వెల్లడించారు.
Train Accident Nizamabad | జానకంపేట్ – నిజామాబాద్ రైల్వేస్టేషన్ల మధ్య..
రైల్వే డివిజన్ పరిధిలోని నిజామామాబాద్–జానకంపేట్ రైల్వేస్టేషన్ల (janakampet railway station) మధ్య గురువారం ఉదయం గుర్తుతెలియని రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు సమచారం అందుకున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ వరలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడికి సంబంధించిన ఎలాంటి వివరాలు లభ్యం కాకపోవడంతో డెడ్బాడీని జీజీహెచ్కు తరలించామని.. రైల్వే స్టేషన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రైల్వే ఎస్సై తెలిపారు. వివరాలకు 8712658591లో సంప్రదించాలని కోరారు.
ఇది కూడా చదవండి: ACB Raid | ఏసీబీ వలలో అటవీశాఖ అధికారులు.. రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటూ..

