అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Rains | తెలంగాణలో అకాల వర్షం (Unseasonal Rains) బీభత్సం సృష్టించింది. సాయంత్రం పూట ఒక్కసారిగా భారీ వానపడటంతో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి ఎండతీవ్రత అధికంగా ఉంది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్ (Adilabad), నిర్మల్, నిజామాబాద్, వరంగల్, మెదక్ (Medak), కామారెడ్డి జిల్లాల్లో భారీ వాన పడింది. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, మోర్తాడ్, ఏర్గట్ల, వేల్పూరు, ఆర్మూర్, ధర్పల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
Telangana Rains | తడిసిన ధాన్యం
రాష్ట్రంలో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం సాయంత్రం ఒక్కసారిగా గాలులతో కూడిన వాన పడటంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పంటను కాపాడుకోవడానికి రైతులు అనేక ప్రయత్నాలు చేశారు. ఈదురుగాలులకు వడ్ల కుప్పలపై కప్పిన టార్పాలిన్లు సైతం కొట్టుకుపోయాయి. దీంతో ధాన్యం తడిసిపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం..అన్నదాతకు తీరని శోకం!
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్,
మెదక్ జిల్లాల్లో వర్ష బీభత్సంనిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, మోర్తాడ్, ఏర్గట్ల, వేల్పూరు, ఆర్మూర్, ధర్పల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
కొనుగోలు కేంద్రాల్లో తడిసి… pic.twitter.com/eZjkCipNVh
— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) May 7, 2026
దీనిని కూడా చదవండి : Paddy Farmers | ప్రాణాలు పోతున్న పట్టదా.. కొనుగోలు కేంద్రాల్లో చనిపోతున్న రైతులు

