Farmer Death Incident | బావిలో జారి పడి రైతు మృతి

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Farmer Death Incident | సొంత వ్యవసాయ పొలం వద్ద ఉన్న బావిలో కాలు జారిపడి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సదాశివనగర్ మండల (Sadasivanagar Mandal) కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది.

Farmer Death Incident | విషాదఛాయలు

గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్మ జోగిని లింగం(50) ప్రతిరోజు మాదిరిగానే ఆదివారం రాత్రి పొలం దగ్గరికి వెళ్లాడు. ఉదయం అయినా ఇంకా తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్ద అంతటా వెతికారు. ఎక్కడా లింగం జాడ కనిపించలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పొలం వద్ద ఉన్న బావి వద్ద కాలు జారిన ఆనవాళ్లు కనిపించడంతో బావిలో వెతకగా లింగం మృతదేహం లభ్యం అయింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లింగం మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి..: Travels Bus Accident | ట్రావెల్స్​ బస్సు ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *