Farmers Protest | సొసైటీ కార్యాలయానికి తాళం వేసి రైతుల నిరసన

shashi kiran Mottala
Farmers Protest | సొసైటీ కార్యాలయానికి తాళం వేసి రైతుల నిరసన

అక్షరటుడే, బాన్సువాడ: Farmers Protest | బీర్కూర్ (Birkur)​ మండలంలోని బైరాపూర్ గ్రామంలో రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. సొసైటీ (Bairapur Society) పరిధిలో ధాన్యానికి కాంటాలు (paddy procurement) వేయకపోవడం, ఇతర గ్రామాలకు మాత్రం ప్రాధాన్యం ఇస్తున్నారంటూ రైతులు ఆరోపించారు. ఆగ్రహానికి లోనైన రైతులు సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.

Farmers Protest | వారం రోజులుగా..

గత వారం రోజులుగా సొసైటీ కార్యదర్శి విధులకు హాజరు కాకపోవడంతో పాటు, ఫోన్ చేసినా స్పందించడం లేదని రైతులు తెలిపారు. ప్రస్తుతం వాతావరణ (Weather) హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో, కోసిన ధాన్యం తడిసిపోతుందనే భయంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈనెల 4న కోసిన వడ్లకు ఇప్పటివరకు కాంటాలు వేయకపోగా 18న కోసిన వడ్లకు మాత్రం వెంటనే కాంటాలు వేయడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల మధ్యవివక్ష చూపకుండా వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

paddy 1

ఇది కూడా చదవండి: Kavita new party | కవిత పార్టీలో చేరికల జోరు.. జాగృతిలోకి మాజీ ఎమ్మెల్యే

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *