అక్షరటుడే, వెబ్డెస్క్ : NEET Re Exam | నీట్ పరీక్షపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో జూన్ 21న ఆదివారం మళ్లీ పరీక్ష పెడుతామని తెలిపింది.దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో (Medical Colleges) ఎంబీబీఎస్ సీట్ల భర్తీ కోసం మే 3న నీట్ యూజీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే పేపర్ లీకేజీ కావడంతో ఎన్టీఏ ఆ పరీక్షను రద్దు చేసింది.
మళ్లీ ఎగ్జామ్ పెడుతామని ప్రకటించింది. ఈ మేరకు కొత్త పరీక్ష తేదీ వివరాలను తాజాగా వెల్లడించింది. గతంలో నిర్వహించిన పరీక్షకు దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు హాజరు అయ్యారు. ఎగ్జామ్ క్యాన్సల్ కావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో జూన్ 21న పరీక్ష పెడతామని ఎన్టీఏ తెలిపింది. పరీక్షకు సంబంధించిన ప్రామాణికమైన తాజా సమాచారం, వివరాల కోసం అభ్యర్థులు, తల్లిదండ్రులు తమ అధికారిక సమాచార మాధ్యమాలపై మాత్రమే ఆధారపడాలని సూచించింది.
NEET Re Exam | లీకేజీపై నిరసనలు
దేశంలో మే 3న జరిగిన నీట్ పరీక్ష లీకేజీ (NEET Exam Leak)పై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఎన్టీఏ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. రూ.లక్షలు పెట్టి కోచింగ్ తీసుకుంటున్న తమ భవిష్యత్తో ప్రభుత్వం ఆడుకుంటోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు నిరసనలు తెలుపుతున్నారు. అయితే మే 3న పరీక్షకు కొన్ని రోజుల ముందే ప్రశ్నాపత్రం లీక్ అయింది. దానిని పలువురు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. గెస్ పేపర్ పేరిట సోషల్ మీడియాలో దానిని వైరల్ చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. దీనిపై కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి..: Telangana ANM Results | ఏఎన్ఎం పరీక్ష ఫలితాలు విడుదల


