అక్షరటుడే, కామారెడ్డి: Elderly Man Missing | దాదాపు పాతికేళ్ల క్రితం తప్పిపోయిన ఓ వృద్ధుడు పోలీసుల కృషితో మళ్లీ సొంతింటికి చేరారు. కామారెడ్డి పట్టణ పోలీసులు (Kamareddy Police) శుక్రవారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
Elderly Man Missing | జోగులాంబ గద్వాల్ జిల్లా పూటన్పల్లి..
జోగులాంబ గద్వాల్ జిల్లా (Jogulamba Gadwal District) పూటన్ పల్లి గ్రామానికి చెందిన 65 ఏళ్ల సత్యనారాయణ చారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సత్యనారాయణ చారి 24 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. గురువారం రాత్రి కామారెడ్డి పోలీస్ కానిస్టేబుల్ అశోక్, హోంగార్డు రవి పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తుండగా కనిపించిన సత్యనారాయణ చారి దగ్గర వివరాలు సేకరించారు. అనంతరం కామారెడ్డి పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. వెంటనే వారు గద్వాల్ పోలీస్ స్టేషన్కు వివరాలను అందజేయగా వారు వివరాలు తెలుసుకొని గ్రామంలో విచారించి సత్యనారాయణ తప్పిపోయిన విషయం నిజమేనని నిర్దారించారు. తప్పిపోయిన వ్యక్తి ఫొటో చూసిన కుటుంబ సభ్యులు ఆయన సత్యనారాయణ చారిగా గుర్తుపట్టారు. దాంతో గద్వాల్ పోలీసులు కుటుంబ సభ్యులను కామారెడ్డి (kamareddy)కి పోలీస్ స్టేషన్కు పంపించారు. శుక్రవారం ఉదయం పట్టణ సీఐ నరహరి (CI Narahari) సమక్షంలో సత్యనారాయణ చారిని వారి కుమారులకు అప్పగించారు. వృద్ధుని ఆచూకీ కనుగొన్న సిబ్బందిని సీఐ అభినందించారు.
ఇది కూడా చదవండి..: Negligent Driving Accident | నిర్లక్ష్యపు కారు డ్రైవింగ్కు నిండు ప్రాణం బలి..


