అక్షరటుడే, డిచ్పల్లి: Dharpally Police | చిన్నపాటి వాగ్వాదంలో ఓ వ్యక్తి ఎదుటి వ్యక్తి వేలు కొరికేశాడు. ఈ ఘటన ధర్పల్లి (Dharpally) మండలం హొన్నాజీపేట్లో శుక్రవారం చోటు చేసుకుంది.
Dharpally Police | ధర్పల్లి మండలంలో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హొన్నాజీపేట్ (honnajipet) గ్రామానికి చెందిన మచ్చ శోభతో గ్రామానికి చెందిన పెద్ది రాకేష్ అనే వ్యక్తి అకారణంగా వాదనకు దిగాడు. సమాచారం తెలుసుకున్న శోభ భర్త పెద్ది బాలయ్య ఎందుకు తన భార్యతో గొడవకు దిగావని రాకేష్ను అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా ఆగ్రహంతో ఉన్న రాకేష్.. బాలయ్య ఎడమ చేయి మధ్య వేలును కొరికేశాడు. దీంతో వేలులో కొద్ది భాగం తెగి కింద పడిపోయింది. అనంతరం రాకేష్ సంఘటనా స్థలం నుంచి పారిపోగా బాలయ్యను ఆయన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు రాకేష్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : Telangana Sewerage Projects|పట్టణాల్లో ‘మెగా’ సీవరేజ్ ప్రాజెక్టులు.. రూ. 3,705 కోట్లు కేటాయించిన సర్కార్


