Dharpally Police | ఆగ్రహంతో వేలు కొరికిన వ్యక్తి.. రిమాండ్​కు తరలించిన పోలీసులు

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Dharpally Police | చిన్నపాటి వాగ్వాదంలో ఓ వ్యక్తి ఎదుటి వ్యక్తి వేలు కొరికేశాడు. ఈ ఘటన ధర్పల్లి (Dharpally) మండలం హొన్నాజీపేట్​లో శుక్రవారం చోటు చేసుకుంది.

Dharpally Police | ధర్పల్లి మండలంలో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హొన్నాజీపేట్ (honnajipet)​ గ్రామానికి చెందిన మచ్చ శోభతో గ్రామానికి చెందిన పెద్ది రాకేష్ అనే వ్యక్తి అకారణంగా వాదనకు దిగాడు. సమాచారం తెలుసుకున్న శోభ భర్త పెద్ది బాలయ్య ఎందుకు తన భార్యతో గొడవకు దిగావని రాకేష్​ను అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా ఆగ్రహంతో ఉన్న రాకేష్.. బాలయ్య ఎడమ చేయి మధ్య వేలును కొరికేశాడు. దీంతో వేలులో కొద్ది భాగం తెగి కింద పడిపోయింది. అనంతరం రాకేష్​ సంఘటనా స్థలం నుంచి పారిపోగా బాలయ్యను ఆయన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు రాకేష్​ను అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Telangana Sewerage Projects|పట్టణాల్లో ‘మెగా’ సీవరేజ్ ప్రాజెక్టులు.. రూ. 3,705 కోట్లు కేటాయించిన సర్కార్

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *