క్రైంDharpally Police | ఆగ్రహంతో వేలు కొరికిన వ్యక్తి.. రిమాండ్​కు తరలించిన పోలీసులు

Dharpally Police | ఆగ్రహంతో వేలు కొరికిన వ్యక్తి.. రిమాండ్​కు తరలించిన పోలీసులు

చిన్నపాటి వాగ్వాదంలో ఓ వ్యక్తి ఎదుటి వ్యక్తి వేలు కొరికేశాడు. ఈ ఘటన ధర్పల్లి మండలం హొన్నాజీపేట్​లో శుక్రవారం చోటు చేసుకుంది.

అక్షరటుడే, డిచ్​పల్లి: Dharpally Police | చిన్నపాటి వాగ్వాదంలో ఓ వ్యక్తి ఎదుటి వ్యక్తి వేలు కొరికేశాడు. ఈ ఘటన ధర్పల్లి (Dharpally) మండలం హొన్నాజీపేట్​లో శుక్రవారం చోటు చేసుకుంది.

Dharpally Police | ధర్పల్లి మండలంలో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హొన్నాజీపేట్ (honnajipet)​ గ్రామానికి చెందిన మచ్చ శోభతో గ్రామానికి చెందిన పెద్ది రాకేష్ అనే వ్యక్తి అకారణంగా వాదనకు దిగాడు. సమాచారం తెలుసుకున్న శోభ భర్త పెద్ది బాలయ్య ఎందుకు తన భార్యతో గొడవకు దిగావని రాకేష్​ను అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా ఆగ్రహంతో ఉన్న రాకేష్.. బాలయ్య ఎడమ చేయి మధ్య వేలును కొరికేశాడు. దీంతో వేలులో కొద్ది భాగం తెగి కింద పడిపోయింది. అనంతరం రాకేష్​ సంఘటనా స్థలం నుంచి పారిపోగా బాలయ్యను ఆయన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు రాకేష్​ను అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Telangana Sewerage Projects|పట్టణాల్లో ‘మెగా’ సీవరేజ్ ప్రాజెక్టులు.. రూ. 3,705 కోట్లు కేటాయించిన సర్కార్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Tirupati Minor Assault | దారుణం.. 16 ఏళ్ల బాలికపై సొంత బాబాయ్ లైంగిక దాడి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati Minor Assault | హైదరాబాద్‌కు చెందిన 16...

Revanth Reddy | దేశ రాజకీయాల్లోకి వెళ్తా.. సీఎం రేవంత్​రెడ్డి కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy | తాను దేశ రాజకీయాల్లోకి...

Digital Health Cards| ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఆర్సీ నివేదికపై సర్కార్ క్లారిటీ

అక్షరటుడే వెబ్‌డెస్క్:Digital Health Cards |తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల...