అక్షరటుడే, వెబ్డెస్క్ : Bandi Bhageerath POCSO | బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్ ఎక్కడ తలదాచుకున్నాడు అనేది కేంద్ర మంత్రి అయిన భగీరథ్ తండ్రికి, రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి మాత్రమే తెలుసన్నారు.
ప్రవీణ్కుమార్ తెలంగాణ భవన్లో శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. భగీరథ్పై పోక్సో కేసు నమోదు అయి 9 రోజులు గడుస్తున్నా.. పోలీసులు ఇంకా అతడిని అరెస్ట్ చేయలేదన్నారు. కానీ జర్నలిస్ట్లు, బీఆర్ఎస్ నాయకులను రాత్రికి రాత్రే అరెస్ట్ చేస్తారని విమర్శించారు. ‘‘తన కొడుకు బాలికపై వేధింపులకు పాల్పడ్డట్లు కేంద్ర మంత్రి సంజయ్ సీఎం రేవంత్రెడ్డి ముందే చెప్పాడు’ అని ప్రవీణ్కుమార్ అన్నారు.
Bandi Bhageerath POCSO | నిస్సహాయ సీఎం
ప్రధాన మంత్రి (PM Visit) పర్యటన బందోబస్త్ కార్యక్రమంలో పోలీసులు బిజీగా ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్తున్నారని ఆయన అన్నారు. అయితే ఈ బందోబస్త్లో ఎక్కడా కూడా పేట్ బషీరాబాద్ ఏసీపీ, డీసీపీ పాల్గొనలేదన్నారు. బందోబస్త్లో 10 వేల మంది పాల్గొంటే రాష్ట్రంలోని మిగతా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నిస్సహాయ ముఖ్యమంత్రిగా, నిస్సహాయ హోంమంత్రిగా నిందితుడిని అప్పగించాలని ఆయన తండ్రిని అడుక్కుంటున్నారని విమర్శించారు.
Bandi Bhageerath POCSO | బాలిక పరిస్థితి ఏమిటి
భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో తన పేరు వాడొద్దని ఆయన తండ్రి కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. అయితే బాలిక వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆమె ఫొటోలు వాడొద్దని కోర్టులో ఎవరు కోరుతారని ప్రశ్నించారు. బాలికకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. పోక్సో కేసులో భగీరథ్ను కాపాడేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా ఈ ఘటన గురించి చర్చించుకుంటున్నారంటే అది కేవలం సోషల్ మీడియా వల్లనే
సోషల్ మీడియాలో బాధితురాలికి మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు
– బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ pic.twitter.com/sOnOHuT5tK
— Telugu Scribe (@TeluguScribe) May 16, 2026
దీనిని కూడా చదవండి : Borewell Rescue Tragedy | బోరుబావిలో పడిన మనవడు.. కాపాడబోయి తాత మృతి


