TG EAPCET Results | తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TG EAPCET Results | తెలంగాణలో ఎప్​సెట్​ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంజినీరింగ్ (Engineering)​, ఫార్మసీ (Pharmacy), అగ్రికల్చర్​ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎప్​సెట్​ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్​లోని జేఎన్​టీయూ (JNTUH) ఆదివారం ఉదయం ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,97,241 మంది, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో 84,954 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు. విద్యార్థులు http://eapcet.tgche.ac.inలో ఫలితాలు చూసుకొవొచ్చు. కాగా, ఈ ఏడాది ఎప్‌సెట్‌ చివరి పరీక్ష ముగిసిన వారం రోజుల్లోపే ఫలితాలను ప్రకటించడం గమనార్హం.

TG EAPCET Results | 73.36 శాతం ఉత్తీర్ణత

ఇంజనీరింగ్‌లో 73.36 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్‌లో 156.63 మార్కులతో ఎం. రుషి (ఉప్పల్​) టాపర్​గా నిలిచాడు. 148.70 మార్కులతో అన్షుల్, 147.05 మార్కులతో టాప్‌-3గా కడపకు చెందిన వంశీధర్‌రెడ్డి తర్వాత స్థానాల్లో నిలిచారు.

దీనిని కూడా చదవండి : Telangana ANM Results | ఏఎన్​ఎం పరీక్ష ఫలితాలు విడుదల

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *