అక్షరటుడే, వెబ్డెస్క్ : TG EAPCET Results | తెలంగాణలో ఎప్సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంజినీరింగ్ (Engineering), ఫార్మసీ (Pharmacy), అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎప్సెట్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్లోని జేఎన్టీయూ (JNTUH) ఆదివారం ఉదయం ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,97,241 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 84,954 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు. విద్యార్థులు http://eapcet.tgche.ac.inలో ఫలితాలు చూసుకొవొచ్చు. కాగా, ఈ ఏడాది ఎప్సెట్ చివరి పరీక్ష ముగిసిన వారం రోజుల్లోపే ఫలితాలను ప్రకటించడం గమనార్హం.
TG EAPCET Results | 73.36 శాతం ఉత్తీర్ణత
ఇంజనీరింగ్లో 73.36 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్లో 156.63 మార్కులతో ఎం. రుషి (ఉప్పల్) టాపర్గా నిలిచాడు. 148.70 మార్కులతో అన్షుల్, 147.05 మార్కులతో టాప్-3గా కడపకు చెందిన వంశీధర్రెడ్డి తర్వాత స్థానాల్లో నిలిచారు.
దీనిని కూడా చదవండి : Telangana ANM Results | ఏఎన్ఎం పరీక్ష ఫలితాలు విడుదల


