అక్షరటుడే, వెబ్డెస్క్: ACB Raids | హైదరాబాద్ (Hyderabad)లోని జలమండలి (HMWSSB)లో పని చేస్తున్న జనరల్ మేనేజర్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో భారీగా అక్రమాస్తులు గుర్తించారు.
రెడ్హిల్స్ డివిజన్ జీఎంగా కుమార్ పని చేస్తున్నారు. ఆయనపై అక్రమాస్తుల కేసు నమోదు అయింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు (ACB Officers) సికింద్రాబాద్లోని మల్లాపూర్లో ఉన్న కుమార్ నివాసంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో అతడికి రూ.100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. కుమార్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇంట్లో సైతం సోదాలు చేపట్టారు.
ACB Raids | కిలో బంగారం స్వాధీనం
సోదాల సమయంలో జీఎం కుమార్ ఇంట్లో అక్రమాస్తులను చూసి అధికారులు షాక్ అయ్యారు. అతడి నివాసంలో రూ.1.10 కోట్ల నగదు, సుమారు కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అతడికి హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్స్.. 6 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. నిజామాబాద్ (Nizamabad)లో 3 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. ఇంకా పలు బ్యాంక్ల్లో లాకర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. వాటిని ఓపెన్ చేయనున్నారు. బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: AI Social Media Surveillance | ఏఐతో సోషల్ మీడియాపై నిఘా..


