అక్షరటుడే, వెబ్డెస్క్ : MPDO MPO ACB Trap | మరో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఒక వెంచర్ అనుమతి కోసం లంచం డిమాండ్ చేసి, అందులో రూ.45 వేలు తీసుకుంటుండగా ఎంపీడీవో రాధిక, ఎంపీవోతో పాటు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఎంపీడీవో కుమారుడిని రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
MPDO MPO ACB Trap | స్థానికుల సంబరాలు
అవినీతి అధికారులు ప్రజలను పట్టి పీడిస్తున్నారు. లంచాల పేరిట వేధింపులకు పాల్పడుతున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. ఏసీబీ దాడులు (ACB Raids) చేస్తున్నా లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. అయితే ఇలాంటి అధికారులు ఏసీబీకి చిక్కితే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎంపీడీవో, ఎంపీవోను ఏసీబీ అధికారులు పట్టుకోవడంతో ప్రజలు టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నర్సింహులపేట ఎంపీడీవో, ఎంపీఓ
టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్న స్థానికులు
రూ. 45 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయంలో ఒక వెంచర్ అనుమతి కోసం లంచం డిమాండ్ చేసి, ఆ డబ్బులు… pic.twitter.com/vwFWo5Ogvl
— Telugu Scribe (@TeluguScribe) June 12, 2026
ఇది కూడా చదవండి..: Singareni Medical Board | సింగరేణి ఉద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో సింగరేణి మెడికల్ బోర్డు
