అక్షరటుడే, వెబ్డెస్క్ : Agni 4 Missile | రక్షణ రంగంలో భారత్ మరో మైలురాయిని చేరుకుంది. మధ్య శ్రేణి రకానికి చెందిన అగ్ని–4 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.
ఒడిశా (Odisha)లోని చండీపూర్లో గురువారం సాయంత్రం ITR నుంచి అగ్ని-4 క్షిపణి ప్రయోగం చేశారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో పరీక్ష చేపట్టగా.. వివజయవంతం అయింది. ఈ ప్రయోగ సమయంలో భారత్ 3000 కి.మీ.పైగా NOTAM ఆంక్షలు విధించింది. మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-4’ను చండీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి విజయవంతంగా పరీక్షించారు. ఈ ప్రయోగం అన్ని కార్యాచరణ, సాంకేతిక పారామితులను ధృవీకరించిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Agni 4 Missile | 4 వేల కి.మీ. రేంజ్
అగ్ని-4 ఘన-ఇంధన రాకెట్ మోటార్ ద్వారా నడిచే రెండు-దశల, సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణి. ఇది 4,000 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో, భారతదేశం అగ్ని-ప్రైమ్, అగ్ని-3 క్షిపణుల పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. తాజాగా అగ్ని–4 మిసైళ్లను విజయవంతంగా ప్రయోగించింది. దీంతో భారత అమ్ముల పొదిలో త్వరలో ఇది చేరనుంది.
దీనిని కూడా చదవండి : Mohan Bhagwat Gen Z | వాళ్లు దేశ వ్యతిరేకులు కారు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు