Andhra Pradesh | ఏపీని గంజాయి హబ్​గా మార్చారు : సీఎం చంద్రబాబు

గత ఐదేళ్లలో ఏపీ గంజాయి హబ్‌గా మారిందని, విద్వేషాలు పెరిగాయని సీఎం చంద్రబాబు విమర్శించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Andhra Pradesh | గత ఐదేళ్లలో ఏపీ గంజాయి హబ్‌గా మారిందని, విద్వేషాలు పెరిగాయని సీఎం చంద్రబాబు (CM Chandrababu) విమర్శించారు. రాజధాని అమరావతి (Amaravati) అభివృద్ధిని కొందరు అడ్డుకున్నారని ఆరోపించారు.

నెల్లూరులో బుధవారం సీఎం మాట్లాడారు. సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో వెంటనే సిట్‌ వేశామని తెలిపారు. రౌడీలు పోలీసులను ఛాలెంజ్‌ చేస్తే వాళ్లకు రోషం వస్తుందన్నారు. సాయికృష్ణ మిస్సింగ్‌పై కుల ముద్ర వేశారని, పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌ చేశారని ఆగ్రమం వ్యక్తం చేశారు. పవన్‌ కూతురిపైనా అసభ్యకర పోస్టులు పెట్టారన్నారు. బ్లేడ్‌ బ్యాచ్‌, గంజాయి బ్యాచ్‌లకు సపోర్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.

Andhra Pradesh | కోపం లేదు

తనను జైలులో పెట్టినందుకు కోపం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. తాను జైల్లో పెట్టాలనుకుంటే నిమిషం చాలన్నారు. బ్లేడ్ బ్యాచ్‌లు, రౌడీలకు వైసీపీ మద్దతిస్తోందని ఆరోపించారు. సైకోను చూసుకునే వైసీపీ నేతల ఆగడాలు పెరిగాయన్నారు. హోంమంత్రిపై కూడా మేకప్‌ అంటూ కామెంట్స్ చేశారని, ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. తాను బటన్​ నొక్కే సీఎంను కాదని, ప్రజల్లో ఉండే వ్యక్తినని చంద్రబాబు తెలిపారు.

 

దీనిని కూడా చదవండి : Raghav Chadha Petition | రాఘవ్ చద్దా కేసులో హైకోర్టు కీలక నిర్ణయం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *