BJP Protest | డీసీసీ కార్యాలయం ఎదుట బీజేవైఎం ‘వందేమాతరం’ గీతాలాపన..

నిజామాబాద్​ నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట బీజేవైఎం నాయకులు వందేమాతరం గీతాలాపన చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: BJP Protest | నగరంలోని (Nizamabad) కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట బీజేవైఎం (BJYM Nizamabad) నాయకులు వందేమాతరం(Vande Mataram) గీతాలాపన చేశారు.

BJP Protest | డీసీసీ కార్యాలయం ఎదుట..

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్​ అగ్ర నాయకులు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ వందేమాతర గీతాలాపన చేయలేదని బీజేవైఎం నాయకులు ఆరోపించారు. వారికి వందేమాతర గీతం ఎలా పాడాలనేది నేర్పించేందుకు తాము కాంగ్రెస్​ కార్యాలయానికి వచ్చామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయం ఎదుట వందేమాతరం గీతాలాపన చేశామన్నారు.  అయితే అప్పటికే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నాయకులను అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి స్థానిక పోలీస్​స్టేషన్​కు తరలించారు. అంతకుముందు కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్​, కార్పొరేటర్లు కల్పె అర్చన చిరంజీవి, సుధీర్​, శశాంక్​, శ్రావణ్​ పలువురు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Rahul Gandhi Supreme Court | రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *