అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Building Construction Excavation | నగరంలో (Nizamabad) ఓ భారీ భవనం నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా అపశృతి చోటు చేసుకుంది. తవ్వకాల్లో భాగంగా పక్కనే ఉన్న మరో భారీ భవంతి ప్రహరీ కూలిపోయింది. ఈ ఘటన నగరంలోని శ్రీనగర్ కాలనీలో చోటు చేసుకుంది.
Building Construction Excavation | ఓ కార్పొరేట్ ఆస్పత్రి భవన నిర్మాణం..
నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation) పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఓ కార్పొరేట్ ఆస్పత్రి భారీ భవంతి నిర్మాణం జరుగుతోంది. అయితే మూడు సెల్లార్లు నిర్మించే క్రమంలో భారీగా తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న భవంతి ప్రహరీ అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో ఆ భవనంలోని వారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రహరీ కూలిపోయి భవనం అంచుల వరకు మట్టి పూర్తిగా కొట్టుకుపోవడంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా భవన యజమాని సత్యనారాయణ వెంటనే టౌన్ప్లానింగ్ అధికారులకు, కలెక్టర్, సీపీకి ఫిర్యాదు చేశారు. కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణాన్ని కాలనీలో జనావాసాల మధ్య నిర్మించవద్దని సూచించినప్పటికీ నిర్మాణం కొనసాగిస్తున్నారని.. మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు సైతం ఎలా ఇచ్చిందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరగరానిది ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తున్నారని వారు పేర్కొన్నారు. తక్షణమే నిర్మాణాన్ని నిలిపివేయాలని వారు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: ఖైరతాబాద్ గణేశుడి.. వీడియో చూశారా..!