అక్షరటుడే వెబ్డెస్క్: CJP Protest FIRs | నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో తమ ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేస్తామని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలోని ( Delhi )జంతర్ మంతర్ వద్ద పోలీసులు భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు.
CJP Protest FIRs | కేంద్రంపై ఆరోపణలు..
ఉద్యమకారులపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోబోమని గతంలో ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని సిజెపి తీవ్రంగా ఆరోపించింది. నిరసనకారులు పరిమితి దాటి ముందుకు రాకుండా జంతర్ మంతర్ వద్ద ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు, ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు , ఇతర భద్రతా ఏజెన్సీలను భారీగా మోహరించారు. మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో గతంలో 36 రోజుల పాటు ఇక్కడ నిరసనలు జరిగిన ప్రదేశంలో ఇప్పుడు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
CJP Protest FIRs | ప్రధాన డిమాండ్లు ..
గతంలో జులై 25న కుదిరిన ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని, హామీలు ఇచ్చినప్పటికీ బిజెపి పాలిత రాష్ట్రాల్లో వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేశారని సిజెపి ప్రతినిధి అశుతోష్ రంకా విమర్శించారు. నిరసనకారులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లన్నింటినీ వెంటనే రద్దు చేయాలని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని, కొత్త కేసులు నమోదు చేయడం ఆపాలని , కుదిరిన ఒప్పంద పత్రాన్ని బహిరంగపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమను బలవంతంగా మళ్లీ ఉద్యమ బాట పట్టేలా చేస్తోందని, విద్యార్థుల ఆగ్రహం మొత్తం ప్రభుత్వంపైనే ఉందని సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే హెచ్చరించారు.
CJP Protest FIRs | న్యాయ సహాయం కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
కేసులను ఎదుర్కొంటున్న విద్యార్థులకు అండగా ఉండేందుకు దేశవ్యాప్తంగా న్యాయ సహాయ సెల్ను ఏర్పాటు చేయడంతో పాటు, ‘సాక్షి’ అనే ఆన్లైన్ ప్లాట్ఫారమ్ను ప్రారంభించినట్లు సిజెపి తెలిపింది. నిరసనల్లో కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయ సహాయం అందించేందుకు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ రూ. 1 కోటి నిధిని ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ధర్మేంద్ర ప్రధాన్ తన కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో జులై 25న సిజెపి తమ నిరసనను తాత్కాలికంగా విరమించిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: Yellareddy SIR Completion | ఎస్ఐఆర్లో ఎల్లారెడ్డి ప్రత్యేకం.. రాష్ట్రంలోనే మూడో స్థానం