Yellareddy SIR Completion | ఎస్​ఐఆర్​లో ఎల్లారెడ్డి ప్రత్యేకం.. రాష్ట్రంలోనే మూడో స్థానం

ఎల్లారెడ్డి నియోజకవర్గం వందశాతం ఎస్​ఐఆర్​ పూర్తిచేసి రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy SIR Completion | ఎల్లారెడ్డి నియోజకవర్గం వందశాతం ఎస్​ఐఆర్​ పూర్తిచేసి రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. జిల్లాలో ప్రథమంగా సర్ ప్రక్రియ పూర్తిచేసినందుకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan)​, ఎమ్మెల్యే మదన్​మోహన్​ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, బీఎల్​వోలకు అభినందనలు తెలిపారు.

Yellareddy SIR Completion | నియోజకవర్గ వివరాలివే..

నియోజకవర్గంలో మొత్తం 2,28,503 ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, వాటిని బీఎల్​వోలు యాప్​ల ద్వారా వందశాతం డిజిటలైజేషన్​ పూర్తిచేశారు.  22,283 మంది ఓటర్లను మృతిచెందిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిగా, డబుల్​ ఓటర్లుగా గుర్తించారు. నియోజకవర్గంలో 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను విభజించి కొత్త కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా గాంధారిలో 5, లింగంపేటలో 8, నాగిరెడ్డిపేటలో ఒకటి, సదాశివనగర్​లో 4, ఎల్లారెడ్డిలో 2 కేంద్రాలు కొత్తగా రానున్నాయి.

Yellareddy SIR Completion | మండలాల వారీగా వివరాలు

ఓటర్లలో మ్యాప్​కాని వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిలో 998 మంది ఓటర్లు, తాడ్వాయిలో 313, నాగిరెడ్డిపేటలో 576, గాంధారిలో 1,316, లింగంపేటలో 1,096, రామారెడ్డిలో 784, రాజంపేటలో 253, సదాశివనగర్​లో 1,328 ఉన్నారు. అలాగే తాడ్వాయిలో 969మంది ఓటర్లు, నాగిరెడ్డిపేటలో 900, గాంధారిలో 1,202, లింగంపేటలో 1,239, రామారెడ్డిలో 655, ఎల్లారెడ్డిలో 1,115, రాజంపేటలో 341, సదాశివనగర్​లో 1,180 మృతి చెందిఉన్నారు. అలాగే తాడ్వాయిలో 1,208, నాగిరెడ్డిపేటలో 873, గాంధారిలో 1,821, లింగంపేటలో 1,164, రామారెడ్డిలో 1,089, ఎల్లారెడ్డిలో 1,212, రాజంపేటలో 413, సదాశివనగర్ 1,395 మంది వివరాలు మ్యాపింగ్​ చేయలేదు.

Yellareddy SIR Completion | ముఖ్య తేదీలు

ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటరు జాబితా నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 10 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరించనున్నారు. ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్​ 10న తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు.

ఇది కూడా చదవండి..: Manjeera River Flow | జలకళను సంతరించుకున్న మంజీర.. పూజలు చేసిన ఎమ్మెల్యే పోచారం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *