అక్షరటుడే, వెబ్డెస్క్ : crop procurement | ధాన్యం దళారులపాలు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పంటల కొనుగోలులో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేటీఆర్ మంగళవారం సంగారెడ్డి (Sangareddy) జిల్లా సదాశివపేటలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. పరకాల నియోజకవర్గంలో ఊకల్, జనగామ నియోజకవర్గం యశ్వంత్పూర్లో పర్యటించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతీ గింజను ప్రభుత్వమే కొంటుండె.. ఇప్పుడు పంటలు కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ తప్పించుకుంటుందన్నారు.
crop procurement | రైతులు చనిపోతున్నా…
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పిట్టల్లా రాలుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించిన ప్రతీ గింజను ఎటువంటి ఆంక్షలు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.2460 మద్దతు ధర ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం మక్కలు కొంటలేదన్నారు.
crop procurement | పెద్ద ఎత్తున ఆందోళనలు
పంట కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని కేటీఆర్ అన్నారు. ధాన్యం, శనగలు, మొక్కజొన్నలు, ఇతర అన్ని పంటలను వెంటనే కొనుగోలు చేయకుంటే, ఎక్కడికక్కడ రోడ్లెక్కి రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.
ఈరోజు పరకాల నియోజకవర్గంలోని ఊకల్లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని మా పార్టీ నాయకులతో సందర్శించి, రైతులతో మాట్లాడాను.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది.
2460 రూపాయల మద్దతు ధర ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం మక్కలు కొంటలేదు. తీవ్రమైన ఎండలు, అకాల వర్షాల… pic.twitter.com/FWRRm9Ykmz
— KTR (@KTRBRS) May 5, 2026
ఇది కూడా చదవండి : Konda Surekha Comments | పుష్కరాలకు ఏపీకి కోట్లు.. తెలంగాణకు సున్నా.. కేంద్రం వివక్షపై సురేఖ ఆగ్రహం!

