DSP Bhima Reddy | అక్రమాస్తుల కేసు.. ఏసీబీ కస్టడీకి డీఎస్పీ భీమ్​రెడ్డి

అక్రమాస్తుల కేసులో అరెస్ట్​ అయిన డీఎస్పీ భీమ్​రెడ్డిని ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : DSP Bhima Reddy | అక్రమాస్తుల కేసులో అరెస్ట్​ అయిన డీఎస్పీ భీమ్​రెడ్డిని ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు ఆయనను ప్రశ్నించనున్నారు.

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు గతంలో భీమ్​రెడ్డి నివాసాల్లో సోదాలు చేశారు. భారీగా అక్రమాస్తులను గుర్తించారు. జులై 7న ఆయనను కోర్టులో ప్రవేశ పెట్టగా.. న్యాయమూర్తి రిమాండ్​ విధించారు. అనంతరం ఆయనను కస్టడీకి అప్పగించాలని నాంపల్లి ఏసీబీ కోర్టులో అధికారులు పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రెండు రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో గురువారం ఉదయం ఏసీబీ అధికారులు ఆయనను కస్టడీకి తీసుకున్నారు.

DSP Bhima Reddy | రూ.300 కోట్ల ఆస్తులు

హైదరాబాద్ (Hyderabad), సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పని చేసిన భీం రెడ్డి భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ఆయన డీజీపీ ఆఫీస్‌లోని కంప్యూటర్‌ సర్వీసెస్‌లో పని చేస్తున్నారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.300 కోట్ల విలువైన ఆదాయానికి మించిన అక్రమాస్తులను గుర్తించారు. ఆయనకు అనేక ప్లాట్లు, నివాసాలు, వాణిజ్య భవనాలు ఉన్నాయి. సంగారెడ్డి జహీరాబాద్‌లో 3.5 ఎకరాలు, వికారాబాద్ మోమిన్‌పేటలో 1,000 చదరపు గజాల ల్యాండ్ పార్సిల్‌తో పాటు 2 ఎకరాల వ్యవసాయ భూమి. సి.సి.కుంట ముచింతల గ్రామంలో 4 ఎకరాల 20 గుంటల భూమి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కర్ణాటకలో ఒకచోట 6 ఎకరాలు, మరోచోట 38 ఎకరాల భారీ వ్యవసాయ భూమి, బెంగళూరు దేవనహళ్లిలో 1 ఎకరం భూమి ఉంది.

దీనిని కూడా చదవండి : Urea Shortage Farmers | యూరియా కోసం కాళ్లు మొక్కిన రైతు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *