అక్షరటుడే, వెబ్డెస్క్ : Revanth Reddy Comments | సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరి (Paddy), మొక్కజొన్న (Maize) సాగుతో సమస్యలు పెరుగుతున్నాయన్నారు. రైతులు పంట మార్పిడి చేయాలని సూచించారు.
సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన మహిళా సదస్సులో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. రూ.500 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. మహిళలకు అందించే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను అద్భుతంగా నడిపాయన్నారు. మిగతా ఎవరికిచ్చిన ప్రయోజనం లేదన్నారు. వడ్లు, మక్కలు మన సమస్యలను తీర్చవని, సమస్యలను పెంచుతున్నాయని పేర్కొన్నారు. పంట మార్పిడిపై మహిళలు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. కందులు, మినుములు, పెసర్లు వంటి పప్పు ధాన్యాలు సాగు చేయాలని సూచించారు. కూరగాయలు పండించాలని, పండ్ల తోటల పెంపకం చేపట్టాలన్నారు.
Revanth Reddy Comments | మహిళలకు ప్రత్యేక గుర్తింపు
మన సంస్కృతి సంప్రదాయాల్లో మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం పేర్కొన్నారు. అమెరికాలో మహిళలకు ఓటు హక్కు వచ్చేందుకు వందల ఏళ్లు పట్టిందని, భారత్కు స్వాతంత్య్రం రాగానే మహిళలకు ఓటు హక్కు ఇచ్చిన ఘనత నెహ్రూదే అన్నారు. ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ (Indira Gandhi) పేరు సంపాదించారని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి గొప్పనేతలున్నారని గుర్తు చేశారు.

Revanth Reddy Comments | బీజేపీ, బీఆర్ఎస్లపై విమర్శలు
దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిని, ముఖ్యమంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ అని సీఎం పేర్కొన్నారు. BJP 40ఏళ్ల రాజకీయాల్లో మహిళలను పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా చేసిందా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ (BRS) సైతం మహిళలను అధ్యక్షురాలు చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలనలో తొలి ఐదేళ్లు మహిళలకు మంత్రి పదవికూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే సీతక్క, సురేఖలను మంత్రులు చేశామన్నారు. ఆడబిడ్డలతో పెట్టుకుంటే అధికారమే పోతుందన్నారు.
మహిళా సంఘాల బలోపేతం, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో 553 బస్సులను మహిళా సంఘాలకు అందజేసింది, సీఎం రేవంత్ రెడ్డి గారు పరేడ్ గ్రౌండ్స్లో మహిళా శక్తి సభలో జెండా ఊపి రెండో విడత బస్సులను ప్రారంభించారు. pic.twitter.com/5LaNVlfL7K
— TG Govt Updates (@TGGovtUpdates) June 9, 2026
దీనిని కూడా చదవండి : Anganwadi Salaries | అంగన్వాడీలకు జీతాలు చెల్లించాలి: హరీశ్రావు
