అక్షరటుడే, వెబ్డెస్క్ : Meenakshi Natarajan Nomination | రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను ఎన్నికల సంఘం తిరస్కరించింది.
పలు రాష్ట్రాల్లోని రాజ్యసభ (Rajyasabha) స్థానాలకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 18న ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్లో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ వేశారు.
Meenakshi Natarajan Nomination | బీజేపీ ఫిర్యాదుతో..
తెలంగాణ (Telangana)లో క్రిమినల్ కేసుల వివరాలు అఫిడవిట్లో వెల్లడించలేదని ఈసీకి బీజేపీ (BJP) ఫిర్యాదు చేసింది. ఆస్తుల వివరాలు తెలపలేదని పేర్కొంది. దీంతో రిటర్నింగ్ అధికారి మీనాక్షి నామినేషన్ తిరస్కరించారు. ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ స్పందించారు. ఈసీ నిర్ణయంపై కోర్టులో తేల్చుకుంటామన్నారు. ఓటమికి భయపడి నామినేషన్ తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీస్ ఇస్తే సమాధానం చెప్పేవాళ్లమన్నారు.
Meenakshi Natarajan Nomination | మూడో అభ్యర్థిని నిలిపిన బీజేపీ
మధ్యప్రదేశ్లో మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బీజేపీకి 164, కాంగ్రెస్కు 62 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సంఖ్యా బలం ఆధారంగా బీజేపీ రెండు, కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకునే అవకాశం ఉంది. అయితే బీజేపీ మూడుస్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. ఈ క్రమంలో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడంతో బీజేపీ అభ్యర్థులు ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే ఈ విషయమై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

దీనిని కూడా చదవండి : Veena Vijayan ED Notice | కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తెకు ఈడీ నోటీసులు
