అక్షరటుడే, బాన్సువాడ: Ganesh Immersion Safety | నిమజ్జన ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) సూచించారు. పట్టణంలో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి పాత బాన్సువాడ చావిడి నుంచి కల్కి చెరువు వరకు రూట్మ్యాప్ను ఆయన శుక్రవారం పరిశీలించారు.
Ganesh Immersion Safety | పక్కాగా ఏర్పాట్లు జరగాలి
భక్తులు, ఉత్సవ కమిటీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఎస్పీ కోరారు. ఉత్సవ కమిటీలు, భక్తులు పోలీసు, అధికార యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. నిమజ్జన రూట్లో ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సౌకర్యాలు, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, భద్రతా చర్యలు తదితర అంశాలను పరిశీలించారు. విగ్రహాల ఊరేగింపు సమయంలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు.
Ganesh Immersion Safety | నిమజ్జన ప్రాంతంలో..
నిమజ్జన ప్రాంతంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఆగ్రోస్ ఇండస్ట్రీస్ మాజీ ఛైర్మన్ కాసుల బాలరాజు, గంగాధర్, కృష్ణారెడ్డి, మాసాని శ్రీనివాస్రెడ్డి, అబ్దుల్ ఖలేఖ్, గోపాల్రెడ్డి, వెంకన్న, శివదయాళ్, ఎజాజ్, వహాబ్, లింగమేశ్వర్, పోలీసు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: MLA Dhanpal | ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లయినా నిధులు శూన్యం: ఎమ్మెల్యే ధన్పాల్