అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Government ITI Admissions | ప్రభుత్వ ఐటీఐ (మైనారిటీ) బోధన్ (Bodhan ITI), నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని ప్రిన్సిపాల్ కె. శాంతారాం తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు.
Government ITI Admissions | వివిధ ట్రేడ్లలో..
ప్రభుత్వ ఐటీఐలో (Government ITI) వివిధ ట్రేడ్లలో (Technical Educatio) నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నామని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తుకు ఉపయుక్తమైన ఉద్యోగావకాశాలు పొందేందుకు ఐటీఐ విద్య ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వ ఐటీఐలో శిక్షణ పొందిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు ఆన్లైన్ (ITI Online Application) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ ఐటీఐ (మైనారిటీ) (Minority ITI) బోధన్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Biscuit Baba| కొత్తగా పుట్టుకొచ్చిన ‘బిస్కెట్ బాబా’.. భక్తి పేరుతో వికృత చేష్టలు

