Government ITI Admissions | ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Government ITI Admissions | ప్రభుత్వ ఐటీఐ (మైనారిటీ) బోధన్ (Bodhan ITI), నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని ప్రిన్సిపాల్ కె. శాంతారాం తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు.

Government ITI Admissions | వివిధ ట్రేడ్​లలో..

ప్రభుత్వ ఐటీఐలో (Government ITI) వివిధ ట్రేడ్లలో (Technical Educatio) నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నామని ప్రిన్సిపాల్​ పేర్కొన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తుకు ఉపయుక్తమైన ఉద్యోగావకాశాలు పొందేందుకు ఐటీఐ విద్య ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వ ఐటీఐలో శిక్షణ పొందిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు ఆన్‌లైన్ (ITI Online Application) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ ఐటీఐ (మైనారిటీ) (Minority ITI) బోధన్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

ఇది కూడా చదవండి: Biscuit Baba| కొత్తగా పుట్టుకొచ్చిన ‘బిస్కెట్ బాబా’.. భక్తి పేరుతో వికృత చేష్టలు

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *