Hussain Sagar FTL | ఎఫ్​టీఎల్​ పరిధిలో 17 అంతస్తుల భవనం.. నోటీసులు జారీ చేసిన జీహెచ్​ఎంసీ

హైదరాబాద్​లోని హుస్సేన్‌సాగ‌ర్ ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో భారీ భవనం నిర్మిస్తున్న ప్రదీప్​ కన్​స్ట్రక్షన్​కు జీహెచ్​ఎంసీ అధికారులు షాక్​ ఇచ్చారు. భవన అనుమతిని రద్దు చేస్తూ షో కాజ్ నోటీసు జారీ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hussain Sagar FTL | హైదరాబాద్ (Hyderabad)​లోని హుస్సేన్‌సాగ‌ర్ ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో భారీ భవనం నిర్మిస్తున్న ప్రదీప్​ కన్​స్ట్రక్షన్​కు జీహెచ్​ఎంసీ అధికారులు షాక్​ ఇచ్చారు. భవన అనుమతిని రద్దు చేస్తూ షో కాజ్ నోటీసు జారీ చేశారు. అలాగే, నో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా జారీ చేశారు.

సోమాజిగూడలోని రాజభవన్ రోడ్డులో (పార్క్ హోటల్ / నెక్లెస్ రోడ్డు సమీపంలో) ఈ బహుళ అంతస్తుల గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ (రెండు టవర్లు, 2 సెల్లార్లు + స్టిల్ట్ + 17 పై అంతస్తులు, క్లబ్ హౌస్‌తో) నిర్మించారు. అయితే హుస్సేన్​ సాగర్​ ఎఫ్​టీఎల్ పరిధిలో దీనిని నిర్మించినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో సోమవారం హైడ్రా, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్లు రంగ‌నాథ్ గారు, ఆర్వీ క‌ర్ణ‌న్ సోమవారం ఆ భవనాన్ని పరిశీలించారు. ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ చేపట్టిన భవన నిర్మాణానికి త‌మ నుంచి ఎలాంటి అనుమ‌తులు లేవ‌ని ఇరిగేషన్ శాఖ ఈ సంద‌ర్భంగా తెలిపింది. ఈ క్రమంలో తాజాగా జీహెచ్​ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడం గమనార్హం.

Hussain Sagar FTL | తప్పుడు సమాచారంతో..

తప్పుడు సమాచారం ఇవ్వడం, కీలక వాస్తవాలను దాచిపెట్టడం ద్వారా అనుమతులు పొందారనే కారణంతో భవన అనుమతిని రద్దు చేయాలని జీహెచ్​ఎంసీ ప్రతిపాదించింది. ఈ విచారణలు పూర్తయ్యేంత వరకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ దరఖాస్తును నిలిపివేశారు. కాగా ఈ కంపెనీ యజమాని ప్రదీప్ రెడ్డి బద్వేలు. జీవో 111 ప్రాంతంలోని జన్‌వాడలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌పై యాజమాన్యాన్ని క్లెయిమ్ చేసిన రియల్టర్ కూడా ఈయనే కావడం గమనార్హం. ఆ ఫామ్‌హౌస్ మాజీ మంత్రి కేటీఆర్​కు చెందినదని, ప్రదీప్ బినామీ అని సీఎం రేవంత్ ఆరోపించారు.

ఇది కూడా చదవండి..: Basara Temple Donation | బాసర అమ్మవారి అనుగ్రహానికి భక్తి కానుక.. గర్భగుడి నిర్మాణానికి రూ.31 కోట్ల మహాదానం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *