అక్షరటుడే వెబ్డెస్క్:India Assembly Election Shocks| ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో సంచలన పరిణామాలు నమోదవుతున్నాయి. దశాబ్దాలుగా తమ రాష్ట్ర రాజకీయాలను శాసించిన ముగ్గురు కీలక నేతలు ఈసారి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల ట్రెండ్స్ గమనిస్తుంటే.. బెంగాల్, కేరళ, తమిళనాడు రాజకీయాలను శాసించిన ముగ్గురు కీలక నేతలు తమ అధికార పీఠాలను కోల్పోయే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. కేవలం పార్టీలే కాకుండా, సాక్షాత్తూ ముఖ్యమంత్రులే తమ సొంత నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉండటం వారు అధికార పీఠాన్ని కోల్పోతున్నారనే సంకేతాలను బలంగా పంపుతోంది.
India Assembly Election Shocks|‘దీదీ’కి కోలుకోలేని దెబ్బ..
పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతంలో నందిగ్రామ్లో ఎదురైన చేదు అనుభవమే ఈసారి భవానీపూర్లోనూ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ధాటికి ఆమె వెనుకబడటంతో, బెంగాల్లో ఈసారి ‘కమల వికాసం’ ఖాయమని, దీదీ ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ కావడం తథ్యమని ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. సుదీర్ఘకాలం బెంగాల్ను ఏలిన మమతకు ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
India Assembly Election Shocks|కేరళలో విజయన్ హ్యాట్రిక్ ఆశలు ఆవిరి..
వరుసగా మూడోసారి విజయం సాధించి కేరళ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాలనుకున్న పినరయి విజయన్కు ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. తన సొంత నియోజకవర్గమైన ధర్మదంలో ఆయన వెనుకంజలో ఉండటంతో ఎల్డీఎఫ్ (LDF) శ్రేణులు నివ్వెరపోతున్నాయి. అక్కడ యూడీఎఫ్ (UDF) ప్రభంజనం వీస్తుండటంతో విజయన్ సర్కార్ పతనం దాదాపు ఖాయమైంది. కేరళ చరిత్రలో హ్యాట్రిక్ విజయం అసాధ్యమని ఈ ఎన్నికల తీర్పు మరోసారి రుజువు చేస్తోంది.
India Assembly Election Shocks|రాజకీయాల్లో ఒక కొత్త శకం..
తమిళనాడులో డీఎంకే కోటలు బద్దలవుతున్నాయి. సీఎం ఎం.కె. స్టాలిన్ తన కంచుకోటగా భావించే కొళత్తూరులో వెనుకబడి ఉండటం రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ సృష్టిస్తున్న రాజకీయ సునామీలో స్టాలిన్ సీఎం కుర్చీ కొట్టుకుపోవడం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ద్రవిడ రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలవుతోందని, దశాబ్దాల రాజకీయ వారసత్వానికి చెక్ పడే సమయం వచ్చిందని వినిపిస్తున్నాయి.
India Assembly Election Shocks|సొంత నియోజకవర్గాల్లో పట్టు..
వరుసగా వెలువడుతున్న ఈ ఫలితాలు చూస్తుంటే.. బెంగాల్లో మమత, కేరళలో పినరయి విజయన్, తమిళనాడులో స్టాలిన్ తమ ఆధిపత్యాన్ని కోల్పోయి, అధికారం నుంచి తప్పుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు తమ మాట చెల్లుబాటు అవుతుందని భావించిన ఈ నేతలు, ఇప్పుడు సొంత నియోజకవర్గాల్లో పట్టు కోల్పోయారు. ప్రజాతీర్పు ముందు ఎంతటి హేమాహేమీలైనా తలవంచక తప్పదని, 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. ఈ ఫలితాలు కేవలం రాష్ట్రాలకే కాకుండా జాతీయ రాజకీయాలపై కూడా భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: KTR Allegations | మా కెమెరాలు, ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

