అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ITI Walking Association | నగరంలోని ఐటీఐ వాకింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మంగళవారం గ్రౌండ్లో వాకింగ్ అసోసియేషన్ (Walking Association) సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ITI Walking Association | అధ్యక్షుడిగా పృథ్వీరాజ్..

ఈ సమావేశంలో అధ్యక్షుడిగా పృథ్వీరాజ్, ప్రధాన కార్యదర్శిగా మోహన్ గైక్వాడ్, కోశాధికారిగా శ్రీరామ్, గౌరవ అధ్యక్షుడిగా మురళీకృష్ణను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. వాకింగ్ గ్రౌండ్లో వాకర్స్కు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ పూర్తిస్థాయిలో పనిచేస్తుందని అన్నారు. వాకింగ్ సభ్యుల ఆహ్లాదం కోసం 12ఏళ్ల నుంచి అనేక సేవా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ సభ్యులతో మమేకమైనట్లు వారు తెలిపారు. నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గానికి సభ్యులు అభినందనలు తెలియజేశారు.
ఇది కూడా చదవండి..: Shabbir Ali Audio | కాంగ్రెస్లో ఏం జరుగుతోంది.. ‘షబ్బీర్ అలీ’ ఆడియో వెనక ఉన్నదెవరు?