అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: నగరంలో (Nizamabad) జెండా బాలాజీ ఉత్సవాలు ఆదివారం భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఆస్థాన అర్చకులు జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Jenda Jatara | భక్తిశ్రద్ధలతో ఊరేగింపు..
ఘన చరిత్ర ఉన్న జెండాకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం భక్తులు.. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య జెండాను, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడి ఉత్సవ మూర్తులను ఊరేగించారు. మేళతాళాల మధ్య జెండా గల్లీలోని జెండా బాలాజీ మందిరంలో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. 15రోజుల పాటు ఆలయంలో జెండా జాతర జరుగుతుందన్నారు. భక్తుల సౌకర్యార్థం ఉదయం 6 గంటల నుంచి ఆలయం తెరిచి ఉంటుందన్నారు. ఆలయ అర్చకులు నాగరాజు, ఈవో ఆంజనేయులు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిచారు. జాతర ప్రారంభంమైన సందర్భంగా ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.
ఇది కూడా చదవండి: భారత్ మండపంలో అలరించిన ‘నవరస’ సాంస్కృతిక ప్రదర్శన