Kailash Kuwait Murder | సాంపల్లిలో ఉద్రిక్తత.. కువైట్​లో హత్యకు గురైన కైలాష్ మృతదేహంతో ఆందోళన

కువైట్​లో హత్యకు గురైన కోరట్​పల్లి యువకుడి మృతదేహం ఎట్టకేలకు ఐదునెలల తర్వాత స్వగ్రామానికి చేరుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Kailash Kuwait Murder | కువైట్​లో (Kuwait) హత్యకు గురైన కోరట్​పల్లి యువకుడి మృతదేహం ఎట్టకేలకు ఐదునెలల తర్వాత స్వగ్రామానికి చేరుకుంది. దీంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.

Kailash Kuwait Murder | మృతుని కుటుంబ సభ్యుల ఆందోళన..

కైలాష్​ను హత్య చేసిన మేలయ తండాకు చెందిన గణేష్​ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతుని కుటుంబ సభ్యులు బంధువులు, సాంపల్లి తండా వద్ద రోడ్డుపై ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. నిందితుడు గణేష్​ను శిక్షించేవరకు ఆందోళన విరమించేది లేదని బైటాయించారు. ఈ క్రమంలో కైలాష్ మృతదేహన్ని ఇందల్వాయి టోల్ ప్లాజా నుంచి లోలం, మల్లాపూర్ మీదుగా కోరట్ పల్లి తండాకు తరలించారు. మృతుని బంధువులు ఆగ్రహించి మేలయ తండాలోని నిందితుడు గణేష్ ఇంటిపై దాడి చేశారు.

డిచ్​పల్లి సీఐ వినోద్, ఎస్సై అరీఫ్ ఆందోళనకారులకు నచ్చజెప్పి శాంతింపజేశారు. చట్ట ప్రకారం నిందితుల్ని శిక్షిస్తామని పోలీసులు చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం కోరట్​పల్లి తండాకు చేరుకుని కైలాష్ మృదేహానికి కన్నీళ్ల మధ్య అంత్యక్రియలు జరిపారు. కువైట్​లో మార్చి 19న జరిగిన ఘటనలో కైలాష్ హత్యకు గురయ్యాడు. కైలాష్ మృతదేహం కోసం కుటుంబ సభ్యులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఐదు నెలల తర్వాత మృతదేహం స్వదేశానికి చేరుకుంది.

ఇది కూడా చదవండి: కొండా కుటుంబం ఎటువైపు? కీలక రాజకీయ పరిణామంపై ఆసక్తికర చర్చ!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *