Kamareddy Police | వంతెనపై నుంచి దూకేందుకు వ్యక్తి యత్నం.. కాపాడిన కానిస్టేబుల్

కుటుంబ కలహాలతో బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన వ్యక్తిని కామారెడ్డి జిల్లా పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Police| కుటుంబ కలహాలతో బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించిన వ్యక్తిని కామారెడ్డి (Kamareddy) జిల్లా పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు. ఈ ఘటన అడ్లూర్​–ఎల్లారెడ్డి(Yellareddy) వంతెన వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది.

Kamareddy Police| అనుమానాస్పదంగా తిరుగుతుండగా..

సదాశివనగర్(Sadashivanagar) పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అజర్ గురువారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రాత్రి 9 గంటల సమయంలో అడ్లూర్–ఎల్లారెడ్డి బ్రిడ్జి వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా నిలబడి ఉండటాన్ని గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి విచారించగా అడ్లూర్ గ్రామానికి చెందిన పందిరి నాగరాజు అని, తండ్రి బాలయ్య అని తెలిసింది. కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది బ్రిడ్జిపై నుంచి దూకేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. కానిస్టేబుల్ అజర్ వెంటనే అతడికి ధైర్యం చెప్పి సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడి నాగరాజును వారికి అప్పగించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర స్పందిస్తూ, కానిస్టేబుల్ అజర్ చూపిన అప్రమత్తత, మానవత్వాన్ని అభినందించారు. ప్రజల ప్రాణాలను కాపాడడంలో పోలీసులు ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *