అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Road Accident | కామారెడ్డి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి దుర్మరణం చెందాడు. బైక్పై హైదరాబాద్ వైపు వెళ్తుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. రాయల్ దాబాను దాటిన అనంతరం బైక్పై వెళ్తున్న విద్యార్థిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
Kamareddy Road Accident | యువకుడు నల్గొండ జిల్లా వాసి..
మృతుడిని నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం అజ్జలపల్లి గ్రామానికి చెందిన ఉప్పునూతల నందు (20)గా గుర్తించారు. యువకుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Bihar SUV Rooftop | దొంగల భయం.. ఏకంగా ఇంటి పైకప్పుపైకి SUV.. బిహార్లో ఘటన
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి మృతితో అజ్జలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.