అక్షరటుడే, వెబ్డెస్క్: Manipur Assam Rifles | మణిపూర్లో మరోసారి ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఉఖ్రుల్ జిల్లాలో అసోం రైఫిల్స్కు చెందిన జవాన్ల కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్)తో దాడి చేసినట్లు సమాచారం.
Manipur Assam Rifles | భద్రతా బలగాల అధీనంలోకి..
ఈ పేలుడులో ఇద్దరు జవాన్లు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు ప్రాథమిక సమాచారం. గాయపడిన సిబ్బందిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
IAS Officer Y. Srilaxmi | శిఖరం నుంచి పతనం.. మళ్లీ బాధ్యతల వైపు : వై. శ్రీలక్ష్మి పరిపాలనా ప్రయాణం
దాడి అనంతరం భద్రతా బలగాలు ఘటనాస్థలిని తమ అధీనంలోకి తీసుకుని పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. మృతుల వివరాలు, దాడికి బాధ్యులెవరు అనే అంశాలపై అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.