అక్షరటుడే, ఇందూరు: Medicover Hospitals Nizamabad | మెడికవర్ హాస్పిటల్స్ (Medicover) నిజామాబాద్ ఆధ్వర్యంలో కారక్వాడి జీపీ కార్యాలయంలో ఉచిత వైద్యశిబిరం(Medical Camp) నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
Medicover Hospitals Nizamabad | పరీక్షించి.. వైద్యసలహాలు అందించి..

ఈ శిబిరంలో మెడికవర్ హాస్పిటల్స్ వైద్య బృందం గ్రామంలోని సుమారు 300 మంది ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం వారి ఆరోగ్య సమస్యలను పరిశీలించి తగిన వైద్య సలహాలు అందించింది. రక్తపోటు, మధుమేహం(Diabetes), శ్వాసకోశ సమస్యలు (Respiratory problems), కీళ్ల నొప్పులు, నరాల సంబంధిత సమస్యలు తదితర ఆరోగ్య సమస్యలపై వైద్యులు అవగాహన కల్పించారు. శిబిరానికి వచ్చిన రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, మెరుగైన చికిత్స అవసరమైన వారికి మెడికవర్ హాస్పిటల్లో ప్రత్యేక వైద్య సేవలు పొందాలని సూచించారు.
గ్రామీణ ప్రజలు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మెడికోవర్ హాస్పిటల్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ కార్డియాలజీ(Cardiology) వైద్యుడు జగదీశ్ చంద్ర బోస్, పల్మనాలజిస్ట్ ప్రశాంత్, నర్సింగ్ సిబ్బంది, జీపీ ప్రతినిధులు, ఆరోగ్య కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Pond Drowning | ఆడుకుంటూ వెళ్లి అనంతలోకాలకు.. కుంటలో మునిగి ముగ్గురు చిన్నారుల దుర్మరణం..!
