Mobile Phone Blast | పిడుగుపాటుకు పేలిన రెండు మొబైల్ ఫోన్లు.. తప్పిన ప్రమాదం

పిడుగుపాటుకు రెండు మొబైల్​ ఫోన్లు పేలిపోగా.. ఇద్దరికి గాయాలయ్యాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, గాంధారి: Mobile Phone Blast | పిడుగుపాటుకు రెండు మొబైల్​ ఫోన్లు పేలిపోగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన గాంధారి(Gandhari) మండలంలో చోటు చేసుకుంది.

Mobile Phone Blast | గొడుగు పట్టుకుని పొలానికి వెళ్తుండగా..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలంలోని బొబ్బజివాడి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు మేకల సూర్యకాంత్, శంకర్​లు గొడుగు పట్టుకొని పొలాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగుపడగా వారిద్దరి జేబుల్లోని సెల్​ఫోన్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో వారిరువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 ఈఎంటీ సురేష్, పైలెట్లు క్షతగాత్రులని గాంధారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.

ఇది కూడా చదవండి: రియాద్ ఎయిర్​పోర్టు సమీపంలో భారీ పేలుడు 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *