అక్షరటుడే, వెబ్డెస్క్ : Musi Project Works | రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. విడతల వారిగా మూసీని ప్రక్షాళన చేస్తామని గతంలో సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా తొలిదశలో రూ.7,055 పనులు చేపట్టనున్నట్లు మంత్రివర్గ సబ్ కమిటీ (Cabinet Sub Committee) తెలిపింది.
మూసీ ప్రాజెక్టుపై మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం భేటీ అయింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్ డీపీఆర్ వివరాలను అధికారులు అందజేశారు. తొలిదశలో పనుల కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ADB) నుంచి రుణం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బ్యాంక్తో చర్చలు ముగిశాయన్నారు. తొలిదశలో నిర్మాణాలపై ప్రభావం లేని 5 కిలో మీటర్ల పనులు ప్రారంభించాలని మంత్రివర్గం ఉపసంఘం ఆదేశించింది. దీనికి రూ.రూ.7,055 కోట్లు అవుతాయని అంచనా వేశారు.
Musi Project Works | ప్రజలకు ఇబ్బందులు లేకుండా..
మూసీ సుందరీకరణతో అనేక నివాసాలు ఖాళీ చేయాలని ప్రభుత్వం గతంలో ఆదేశించింది. అయితే ఈ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నిర్మాణాలపై తక్కువ ప్రభావం పడేలా పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అలైన్మెంట్ మార్చాలని మంత్రులు అధికారులకు సూచించారు.
Musi Project Works | రబ్బర్ డ్యామ్ నమూనాలు
మూసీ పనులను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించి 2027 డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా పనులు చేపట్టాలని సూచించారు. వర్షాకాలంలో పనులకు ఆటంకం లేకుండా ముందుగానే చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మూసీపై రబ్బర్ డ్యామ్ నమూనాలను అధికారులు మంత్రులకు చూయించారు.
దీనిని కూడా చదవండి : Secunderabad Love Murder | ప్రేమ వ్యవహారం.. బీటెక్ విద్యార్థి దారుణ హత్య

