Nalgonda Family Murder | ఆస్తి కోసం భర్తతో కలిసి తల్లిని చంపిన కూతురు.. వీడిన నల్గొండ హత్యల మిస్టరీ

నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆస్తి కోసం మృతురాలి కుమార్తె, అల్లుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nalgonda Family Murder | నల్గొండ జిల్లా కేంద్రంలో (Nalgonda District) ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలు హసీనా మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి సుపారీ గ్యాంగ్​తో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

నల్గొండలోని సాగర్ రోడ్డులో గల తెలంగాణ కాలనీలో ఎండీ సుల్తాన్ (45)​, హసీనా (40) దంపతులు, వారి కుమారుడు ముజామిల్​ (20), కుమార్తె అక్సర (11) ఇటీవల దారుణ హత్యకు గురయ్యారు. సుల్తాన్​ బ్యాగుల వ్యాపారం చేస్తుండగా.. హసీనా ప్రైవేటు పాఠశాలలో టీచర్​గా పని చేస్తోంది. వారి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి తలుపులు తెరిచి చూడగా నలుగురి మృతదేహాలు ఉన్నాయి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.

Nalgonda Family Murder | కోటి రూపాయల ఆస్తి కోసం..

హసీనాకు గతంలో రెండు పెళ్లిళ్లు జరిగాయి. అనంతరం నల్గొండకు చెందిన మహ్మద్ సుల్తాన్‌ను మూడో వివాహం చేసుకుంది. సుల్తాన్​కు సైతం గతంలో రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భార్య పిల్లలు మహ్మద్ ముజమిల్, అప్సరతో కలిసి సుల్తాన్​, హసీనా నల్గొండలో జీవిస్తున్నారు. అయితే హసీనా పేరు మీద కోటి రూపాయల విలువైన స్థలాలు, ఇళ్లు ఉన్నాయి. ఆ ఆస్తిని తమకు ఇవ్వకుండా మూడో భర్త పిల్లల మీద వీలునామా రాస్తున్నట్లు హసీనా చెప్పడంతో మొదటి భర్త కూతురు, అల్లుడు కక్ష పెంచుకున్నారు.

Nalgonda Family Murder | రౌడీ షీటర్లతో..

ఆస్తి తమకు దక్కడం లేదని హసీనా మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి ఆ కుటుంబాన్ని అంతం చేయాలని ప్లాన్​ వేశారు. ఈ మేరకు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన నలుగురు రౌడీ షీటర్లతో హత్య చేయించారు. నిందితులు ఇంట్లోకి చొరబడి ఆ నలుగురిని దారుణంగా హత్య చేశారు. సుల్తాన్ మృతదేహంపై 6 చోట్ల, హసీనాకు 7 చోట్ల, అక్సరకు 9 చోట్ల, ముజమిల్‌కు ఏకంగా 16 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో గుర్తించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి..: Container Crash House | ఇంట్లోకి దూసుకెళ్లిన కంటైనర్.. ఒకరి మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *